సికింద్రాబాద్..బోయిన్ పల్లి బాపూజీ నగర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పోచమ్మ టెంపుల్ పక్కనే ఉన్న కట్టెల దుకాణంలో మంటలు అంటుకున్నాయి.మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనస్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీపం మూలంగానే కట్టెలకు మంటలు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు.