తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో, నామినేషన్లు దాఖలైన ఆశావహుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
పొద్దున జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల అధికారులు, 103 ఎంపీటీసీ, 16 జడ్పీటీసీ నామినేషన్లను స్వీకరించారు. అయితే, సాయంత్రానికి హైకోర్టు 42% బీసీ రిజర్వేషన్పై స్టే ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎన్నికల షెడ్యూల్ను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఎస్ఈసీ ప్రకటనలో, “హైకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తాం” అని స్పష్టం చేశారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో అనిశ్చితిని కలిగించింది. అభ్యర్థులు, పార్టీలు తమ వ్యూహాలను పునఃపరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.




