తిరుపతి జిల్లా రేణిగుంట, ఏర్పేడు ప్రాంతాల్లో చైనా దేశస్థుడైన డ్యూయాంగన్ నివాసాలపై Enforcement Directorate (ED), Intelligence Bureau (IB) అధికారులు అక్టోబర్ 9న సోదాలు నిర్వహించారు.
డ్యూయాంగన్ ‘Big Kitchen’ అనే హోటల్ ద్వారా చైనా ఉద్యోగులకు సేవలు అందిస్తూ, పన్నులు చెల్లించకుండా కోట్ల రూపాయల లావాదేవీలు చైనా దేశానికి మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అతని స్క్రాప్ గోడౌన్, బ్యాంకు ఖాతాలు, వివిధ కంపెనీల పేరుతో నిర్వహించిన వ్యాపారాలపై అధికారులు విచారణ చేపట్టారు.
2021లో వీసా ఉల్లంఘన, ఫోర్జరీ కేసులతో అతను అరెస్టయ్యాడు. ప్రస్తుతం తిరుపతి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు తిరుపతి జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.




