హైదరాబాద్లో ఫేక్ ర్యాపిడో యాప్తో క్యాబ్ డ్రైవర్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. నిజమైన యాప్లా కనిపించే నకిలీ ర్యాపిడో యాప్ను ఉపయోగించి ప్రయాణికుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ యాప్ ద్వారా OTP, ఫేర్ వివరాలు కూడా ఫేక్గా చూపిస్తూ ప్రయాణికులను నమ్మబలికేవాడు.
సైబర్ క్రైమ్ పోలీసులు డ్రైవర్ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. యాప్ తయారీకి వెనుక ఉన్న వ్యక్తుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలు అధికారిక ర్యాపిడో యాప్నే ఉపయోగించాలని, అనుమానాస్పద లింకులు లేదా యాప్లను ఇన్స్టాల్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.




