సౌదీలో ఘోర బస్సు ప్రమాదం: పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన భారతీయ భక్తుల జీవితాలు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా కోల్పోయాయి.
మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సు సోమవారం తెల్లవారుజామున డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 42 మంది భారతీయులు సజీవ దహనం అయ్యారు, ఇందులో 16 మంది హైదరాబాద్కి చెందినవారుగా గుర్తించారు.
మృతుల్లో సుమారు 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ఈ హృదయవేదనకర ఘటన ముఫ్రిహత్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, బాధిత కుటుంబాలకు సహాయం అందించడానికి చర్యలు చేపట్టారు.
