దేశవ్యాప్తంగా సైబర్ భద్రతపై మళ్లీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో రాన్స్మ్వేర్ దాడులు ఆందోళనకర స్థాయికి చేరాయి. గత ఏడాదిలోనే 17 వేలకుపైగా రాన్స్మ్వేర్ ఘటనలు నమోదుకావడం దేశంలోని డిజిటల్ మౌలిక వసతులకు పెద్ద సవాలుగా మారింది.
ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ కంపెనీలు, విద్యాసంస్థలు, హెల్త్కేర్ సిస్టమ్స్, చిన్న వ్యాపారాలు కూడా ఈ దాడుల బారిన పడ్డాయి. ఫైళ్లను లాక్ చేసి డబ్బు డిమాండ్ చేసే ఈ దాడులు కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించాయి.
సైబర్ నిపుణులు చెబుతున్న మేరకు, సైబర్ క్రిమినల్స్ కొత్త పద్ధతులతో, అధునాతన టూల్స్ ఉపయోగిస్తూ మరింత పెద్ద స్థాయిలో దాడులు చేస్తున్నారు.
డేటా చోరీ, సిస్టమ్ హ్యాకింగ్, రాన్స్మ్ డిమాండ్ వంటి ఘటనలు పెరుగుతుండడంతో వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత అత్యవసరంగా మారింది. ప్రభుత్వ సంస్థలు కూడా సైబర్ భద్రతను బలోపేతం చేయాలని సూచనలు అందుతున్నాయి.




