తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. ఉదయం నుంచే గ్రామాల్లో ఓటింగ్ ఉత్సాహంగా సాగగా, సాయంత్రానికి కౌంటింగ్ పూర్తవడంతో ఆసక్తికర ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.
కొన్ని కీలక గ్రామాల్లో ఊహించని మార్పులు కనిపించగా, ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చే విధంగా స్థానిక అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. గ్రామీణ రాజకీయాల్లో ఈ తొలి విడత ఫలితాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల ఎన్నికలు జరిగాయి. పలుచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది.రెండో విడతపై కూడా ఇప్పుడు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది |




