కర్నూలు :
కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మాజీ గన్మన్ నాగేష్ మృతి చెందిన వార్త తెలుసుకున్న వెంటనే నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆసుపత్రికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని అన్నారు.
