పదవి విరమణ చేసిన ఏఎంసీ నరసింహారెడ్డికి ఘన వీడ్కోలు సభ

0
19

అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో 40 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో అంకితభావంతో సేవలందించిన ఏఎంసీ నరసింహారెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్లు రాజ్, జితేంద్రనాథ్, శాంతి, శ్రీనివాస్ రెడ్డి, సబితా, అనిల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పదవీ విరమణ చేసిన నరసింహారెడ్డి సేవలను ప్రశంసిస్తూ, ఆయన సౌమ్య స్వభావం, మితభాషి లక్షణాలను కొనియాడారు. ఆయన శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మున్సిపల్ సిబ్బంది, సూపరింటెండెంట్ స్వామి, నారాయణ, మదన్మోహన్, సాయి, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.