రేషన్ డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు: కర్నూలు JC
రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రేషన్ డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కర్నూలు జేసీ డాక్టర్ బి.నవ్య శనివారం తెలిపారు. కార్డుదారులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేది వరకు రేషన్ పొందవచ్చని, 65ఏళ్ల పైబడినవారికి ఇంటికే సరుకులు చేరుస్తామన్నారు. ఫిర్యాదుల కోసం షాప్ ఎదుట బోర్డులు ఏర్పాటు చేశామని, ఇకపై డీలర్లు బాధ్యతగా రేషన్ సరుకుల పంపిణీ చేయాలన్నారు