అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను, ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు తెలంగాణ ఏర్పడిందని, వారందరిని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అమర వీరులను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధనకై మునుముందు రాష్ట్ర అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు పాల్గొన్నారు