శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ నాయకురాలు సీ. వైష్ణవి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ లో ముఖ్య అతిథిగా శ్రీ గణేష్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన వైష్ణవి యాదవ్ కు అభినందనలు తెలిపారు. మిగతా నాయకులు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నామా లేమా అని చూసుకోకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు.