బోరు పాయింట్లు పరిశీలన

0
1

*మల్కాజ్గిరి డివిజన్, గౌతమ్ నగర్ డివిజన్ లలో బోరెవెల్ పాయింట్ల పరిశీలన చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో కలిసి ఇటీవల ఎం.పి లాడ్స్ లో మంజూరు చేయబడిన 8 బోరెవెల్ పాయింట్లు జూలోలజిస్ట్ కు చూపించడం జరిగింది. ఎక్కడ నీరు పడవోచ్చో జూలోజిస్ట్ ద్వారా మార్క్ చెయ్యడం జరిగింది. గుర్తించిన పాయింట్ లలో త్వరలో పవర్ బోర్లు వెయ్యనున్నారు. వీటిలో ఓల్డ్ మల్కాజ్గిరి,భగత్ సింగ్ నగర్, హరిజన బస్తి, యాదవ్ నగర్,భవాని నగర్, ఐ. ఎన్ నగర్, మల్లికార్జున్ నగర్ తదితర బస్తిలు వున్నాయి. ఈ కార్యక్రమం లో ఏ.ఈ నవీన్, రమేష్, జూలోజిస్ట్ డా సాయి, వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.