మహాసభ జెండాను, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి నాయకులు,, బి కృష్ణ ఆవిష్కరించారు. ఈ మహాసభకు మండల సిపిఐ కార్యదర్శి ,బి రాజు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి, డి శేష్ కుమార్ ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎం రాముడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామిలు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన మహాసభకు వర్కు రూగ్రామ శాఖ నాయకులు కె. రాముడు అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో నాయకులు మాట్లాడుతూ,, ఈ మహాసభలు కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి శాఖల దగ్గర పూర్తి చేసుకుని ,నియోజకవర్గం మహాసభకు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వర్క్ ఊరు గ్రామ శాఖ కార్యదర్శిగా మునిస్వామి, సహాయ కార్యదర్శిగా గోవిందుతోపాటు తొమ్మిది మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగినది.