డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
9

కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. బాపూజి నగర్ పరిసర ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడానికి 45 లక్షల రూపాయలతో 300 మిమి డిఐ మెయిన్ ఫీడర్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కొత్త పైప్ లైన్ నిర్మాణం నెల రోజుల వ్యవధిలో పూర్తవుతుందని బాపూజి నగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా పెరిగి వారి కష్టాలు తీరుతాయని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్, బల్వంత్ రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.