South ZoneTelangana కథలోని నీతి By Bharat Aawaz - 18 June 2025 0 3 FacebookTwitterWhatsAppLinkedinTelegram నిజంగా ఈ కధలో నీతిని గ్రహించాలంటే రెండు విషయాలపై ద్రుష్టి పెట్టాలి :- 1) వరదలో చిక్కుకున్న గ్రామం, నిజంగా వరదలో చిక్కుకున్న వారు ప్రాణాలకు తెగించి హెలికాప్టర్ ప్రయాణం కోసం తిరిగి వొస్తారా? ఆది స్వయాన సర్పంచే వొచ్చాడు అంటే వారికి అందనంత దూరంలో వుందనే కదా వారు తిరిగి వొచ్చారు. ప్రతిఒక్క పౌరునికి దేశఫలాలు సమానంగా అందుతే వారేందుకు వొస్తరు అది ప్రాణాలు పణంగా పెట్టి? 2) 2015 or 2016 లో మన ప్రధాన మంత్రి గారు ( రబ్బర్ చెప్పులు ) వేసుకునే వారు విమాన ప్రయాణం చేయాలి అని నాకు కల వుంది అన్నారు ( మరి మనం 2025 లో వున్నాము ఎవరైన రబ్బర్ చెప్పులు తోడుక్కునే వారు విమాన ప్రయాణం చేస్తున్నారా )? ఉచితలు ఇవ్వొద్దు దానికి నేను వెతిరేకిని / కాని రాజ్యాంగంలో దేశ ప్రజలకు అందాల్సిన ఫలాలు కచ్చితంగా అందాల్సిందే అది పేదవాడైనా దనికుడైనా ఒకే లాగా వారికి అందాలి. 1) రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం ప్రతిఒక్క పౌరునికి ఉచిత విద్య అందాలి.( అందుతుందా? ) ధనం వున వారికి నణ్యమైన విద్య ధనం లేనివారికి నాణ్యత లేని విద్య. 2) రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతిఒక్క పౌరునికి ఉచిత ఆరోగ్యం అందాలి.( అందుతుందా?) ధనం వున్నా వారికి సంపూర్ణ వైద్యం, ధనం లేని వారికి నాణ్యత లేని వైద్యం. ( ఉదాహరణ ఎవరైన PM/ CM/ MLA/ MP/ IAS / IPS లేదా పేరు మోసిన వ్యాపార వ్యక్తలు ప్రభుత్వం వైద్యశాలలో వైద్యం చేయించుకున్నారు అనే వార్త ఎపుడైన చదివరా) 3) రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం ప్రతిఒక్క పౌరునికి ఉద్యోగం అందించాలి.( అందుతుందా?) కులాలను బట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు ( ఉదాహరణ: ఉద్యోగాలలో గ్రేడ్ A, B, C, D, అని వుంటాయి A అంటే ఉన్నతమైన పదవి D అంటే కిందిస్థాయి ఉద్యోగం, మీరు తిరిగిన ఏదైన ప్రభుత్వం ఆఫీస్ లో కిందిస్థాయి ఉద్యోగాలలో upper caste వారు వున్నారేమో చుడండి మీకే అర్ధం అయితుంది) 4) రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రతిఒక్క పౌరునికి న్యాయం సమానంగా దొరకాలి. ( దొరుకుతుందా?) డబ్బులు వున్న వారికి న్యాయం ఒకరకంగా వుంటే, డబులు లేని వారికి న్యాయం దొరుకుడు గగనమే. ఇవి నాలుగు ఉచితలు ఏ ప్రభుత్వం అయిన అందిస్తే గ్రామ సర్పంచ్ కాదుకదా కనీసం ఆ గ్రామంలో చదువుకునే పిల్లోడుకుడా వరదధాటి హెలికాప్టర్ ఎక్కలనే ప్రయత్నం చేయడు. (ఇది సత్యం) నాణ్యనికి ఒకవైపు చూడడం మనండి, వాస్తవాలను గ్రహించండి 🙏