శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే

0
13

మచ్చ బొల్లారం డివిజన్:

 

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.

 

 మచ్చ బొల్లారం డివిజన్ మధుర నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవం మరియు హోమం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాలనీవాసులు, భక్తులు పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ మహోత్సవంలో కాలనీవాసులు సుధాకర్, మన్మధ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శరణగిరి సురేష్,నరేష్ , ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

  -sidhumaroju