Home South Zone Andhra Pradesh వర్ష బీభత్సం హెచ్చరిక: విశాఖ అప్రమత్తం |

వర్ష బీభత్సం హెచ్చరిక: విశాఖ అప్రమత్తం |

0

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలతో రాష్ట్రానికి వర్ష బీభత్సం ముప్పు పొంచి ఉంది.

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ‘ఆరెంజ్‌’ ఎలర్ట్‌ జారీ చేయగా, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలకు ‘ఎల్లో’ ఎలర్ట్‌ ప్రకటించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలి.

NO COMMENTS

Exit mobile version