Home South Zone Andhra Pradesh కర్నూలులో బస్సు అగ్నిప్రమాదం.. అధికారుల స్పందన |

కర్నూలులో బస్సు అగ్నిప్రమాదం.. అధికారుల స్పందన |

0

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. టూవీలర్‌ను ఢీకొన్న బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతదేహాలను గుర్తించేందుకు DNA శాంపిల్స్‌ సేకరించగా, 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా IPS లు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

హోం మంత్రి వంగలపూడి అనిత గారు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు—మృతులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమగ్ర విచారణకు ఆదేశించారు.

NO COMMENTS

Exit mobile version