Home South Zone Telangana బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.|

బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.|

0

కర్నూల్ బస్సు ప్రమాదంపై వీడిన మిస్టరీ

హైదరాబాద్: 19 మంది ప్రాణాలు తీసిన ఒక బైకర్ యాక్సిడెంట్.
అర్ధరాత్రి 2 గంటల సమయంలో పల్సర్ బైక్‌పై తన స్నేహితుడు ఎర్రిస్వామి అలియాస్ నానిని తుగ్గలి గ్రామంలో వదిలేందుకు లక్ష్మీపురం నుండి బయలుదేరిన శివశంకర్.
మార్గమధ్యంలో కియా షోరూమ్ వద్ద ఉన్న HP పెట్రోల్ బంక్‌లో రూ.300 పెట్రోల్ నింపుకున్న వీరిరువురూ..
కొద్ది దూరం వెళ్ళగానే స్కిడ్ అయి డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్.
రోడ్డు మీద పడి అక్కడికక్కడే మృతి చెందిన శివశంకర్.. రోడ్డుకు దూరంగా పడి స్వల్ప గాయాలతో బయటపడ్డ వెనక కూర్చున్న నాని.
రోడ్డు మధ్యలో ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగిన నాని.
అంతలోనే రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్‌ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన బస్సు.
బస్సు కింద మంటలు రావడంతో భయపడి తన స్వగ్రామం తుగ్గలికి వెళ్ళిపోయిన నాని.
సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నానిని గుర్తించి, పలు కోణాల్లో విచారించి ప్రమాదం జరిగిన తీరును వివరించిన పోలీసులు.
Sidhumaroju

NO COMMENTS

Exit mobile version