Home Sports మైదానంలో మళ్లీ భారత్-ఆసీస్‌ ఘర్షణ |

మైదానంలో మళ్లీ భారత్-ఆసీస్‌ ఘర్షణ |

0

ICC మహిళల వరల్డ్‌కప్ 2025 సెమీఫైనల్‌లో నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటివరకు టోర్నీలో ఓటమి లేకుండా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా ఎనిమిదో టైటిల్‌ కోసం పోటీపడుతోంది.

మరోవైపు, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు తమ తొలి వరల్డ్‌కప్‌ కిరీటం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. 2017లో భారత్‌ ఆస్ట్రేలియాను ఓడించిన జ్ఞాపకాలు ఈ మ్యాచ్‌కు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

వర్షం ఆటకు ఆటంకం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టాస్ కీలకంగా మారనుండగా, బ్యాటింగ్‌ మొదలుపెట్టే జట్టుకే ఆధిక్యం ఉండే అవకాశముంది.

NO COMMENTS

Exit mobile version