కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) కలిసి దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీకి 2025 నోటిఫికేషన్ విడుదల చేశాయి.
మొత్తం 15,101 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఎంపిక ప్రక్రియను CBSE నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,288 కేవీలు, 653 జవహర్ నవోదయాలు కోసం నియామకాలు జరుగుతాయి. ఎంపికైన
అభ్యర్థులు దేశంలోని ఏ గ్రామీణ, పట్టణ లేదా రెసిడెన్షియల్ పాఠశాలల్లోనైనా సేవలు అందించాల్సి ఉంటుంది.
