పట్టణాల్లో మహిళలకు సురక్షిత ప్రయాణానికి ఒంగోలు ర్యాపిడో మహిళా సర్వీస్ కొత్త దారులు తెరుస్తోంది. ఇప్పుడు ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలకు ప్రత్యేకంగా మహిళలు నడిపే ర్యాపిడో స్కూటీలు అందుబాటులోకి రావడంతో ఈ సేవలు భారీ స్పందన పొందుతున్నాయి.
మెప్మా సంస్థ సహకారంతో 50 మంది యువతులు స్కూటీలు, మరికొందరు ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసి ఉపాధిని పొందుతున్నారు.
ఒంగోలులో మొత్తం 62 మంది మహిళలు ఈ రవాణా సేవల్లో పాల్గొని నెలకు 10–20 వేల వరకు సంపాదిస్తున్నారు. మహిళా డ్రైవర్, మహిళా ప్రయాణికురాలు అనే భద్రతా భావంతో బాలికలు, యువతులు ఈ సేవలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కిలోమీటరుకు 3–5 రూపాయల ఛార్జీలతో అర్ధరాత్రి 12 వరకు సేవలు అందుబాటులో ఉన్నాయి.




