ప్రకాశంజిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని OLXలో కేవలం రూ.20,000కే అమ్మకానికి ఉంచిన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది.
వినూత్నమైన ఈ పోస్టింగ్ చూసి స్థానికులు ఆశ్చర్యపడ్డారు. ఫోటోని చూసిన రెవెన్యూ అధికారులు స్పందించి, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి ఫిర్యాదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
ఎవరు, ఏ ఉద్దేశ్యంతో పోస్టింగ్ పెట్టారో ఇంకా తెలియకపోవడం విశేషం. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




