గుంటూరులో దివ్యాంగుడు చినబాబు పై కత్తితో దాడి చేసి దోపిడి చేసిన ఘటన కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన చినబాబు, ఎంఏ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.
ఆర్థిక సాయం కోసం గుంటూరులో చర్చ్కు వెళ్ళిన ఆయన, రాత్రిపూట తాళాలు మూసివేయబడినందున దగ్గరలోని దర్గా వద్ద విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుజామున, చినబాబు ఎదురుచూస్తున్నపుడు ముగ్గురు దోపిడీదారులు కత్తితో దాడి చేసి 350 రూపాయలు దొంగిలించారు.
స్థానికుల సహాయంతో చినబాబు పోలీస్ స్టేషన్కు చేరి ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.






