టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఉన్న సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. తిరుమలలో దర్శనం ముగించుకున్న తేజ్, తన వివాహం వచ్చే ఏడాదిలోనే జరుగుతుందని స్పష్టం చేయడంతో మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది.
మెగా ఫ్యామిలీలో వరుసగా జరిగుతున్న పెళ్లుల తర్వాత మిగిలింది ఈ బ్రదర్స్ మాత్రమే. చిరంజీవి స్వయంగా వివాహ ఏర్పాట్లు చూస్తున్నారని సమాచారం. విదేశాల్లో చదువుకున్న ఇద్దరు యువతులతో మాట్లాడింపులు పూర్తికి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంతో బిజీలో ఉన్నారు.
