హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, మరియు ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని రవీంద్ర భారతిలో ఈశ్వరీ బాయి 107 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, మాజీ మంత్రి ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గీతారెడ్డి, ఈశ్వరీ బాయి స్మారక అవార్డు గ్రహీత, రాష్ట్ర పంచాయతీరాజ్.
గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి, ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, TGIIC ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగీత , నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజల తో కలసి పాల్గొని బాలికా విద్య, బాలికల హక్కుల కోసం పోరాడిన వీరవనిత ఈశ్వరీ బాయి మహిళా లోకానికి, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
#Sidhumaroju




