Saturday, December 13, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకర్నూలు అంతర పాఠశాల వాలీబాల్ పోటీల్లో విద్యార్థుల మెరిసిన ప్రతిభ |

కర్నూలు అంతర పాఠశాల వాలీబాల్ పోటీల్లో విద్యార్థుల మెరిసిన ప్రతిభ |

జిల్లా అంతర పాఠశాలల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల ప్రతిభ కారణంగా క్రీడ కారణీలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన పీడీ, ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు సన్మానం చేయడం జరిగింది. ఈనెల 9న కర్నూల్
లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అంతర్ జిల్లా వాలీబాల్ పోటీల్లో గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత బాలికల

పాఠశాల విద్యార్థినిలు ప్రథమ స్థానంలో నిలిచి కప్పు గెలుచుకున్నారు. క్రీడల్లో 16 జట్లు పాల్గొనగా గూడూరు చెందిన విద్యార్థినిలు ప్రథమ స్థానంలో గెలచడంతో పట్టణవాసులు విద్యార్థులను అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్యార్థులు ప్రథమ స్థానంలో గెలిపించడంతో గూడూరు పట్టణ వాసులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ టిడిపి ముస్లిం మైనారిటీ నాయకులు సులేమాన్, పాఠశాల పిడి శ్రీనివాసులు, సిరాజ్, ప్రధానోపాధ్యాయులు సారధి శర్మ, ఉపాధ్యాయులు, క్రీడల్లో పాల్గొన్న రాజేశ్వరి ముబీన వైష్ణవి కళ్యాణి అనుష రజియా ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments