కర్నూలు సిటీ :
కర్నూలు అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.. మంత్రి టీజీ భరత్..
రాష్ట్ర పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలు అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, కర్నూలు అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని తెలిపారు.
ఆదివారం కర్నూలులో టీడీపీ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ క్యాడర్ ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. తమ ప్రభుత్వం కొనసాగితే కర్నూలు మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



