Thursday, December 18, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపీపీపీ విధానంలోనూ మెడికల్ కాలేజీలు ప్రభుత్వవే: సీఎం చంద్రబాబు |

పీపీపీ విధానంలోనూ మెడికల్ కాలేజీలు ప్రభుత్వవే: సీఎం చంద్రబాబు |

*Press Release*
పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం*
ప్రభుత్వమే నిబంధనలు పెడుతుంది… ప్రభుత్వమే నిర్దేశిస్తుంది*
పీపీపీ పద్దతిన రోడ్ల నిర్మాణం చేపడితే… ప్రైవేట్ రోడ్లు అవుతాయా?*
విమర్శలు చేస్తే భయపడం.. ప్రజలకు వాస్తవాలు చెబుతాం*
5వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు*
అమరావతి, డిసెంబర్ 17 :* పీపీపీ పద్దతిన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నా…

అవి ప్రభుత్వ కాలేజీల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయి. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా… అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయి.

మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరుతాయి. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించుకునేవాళ్లం. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అవి ప్రైవేటు వ్యక్తులది అయిపోతాయా?”అని చంద్రబాబు ప్రశ్నించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments