విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
– MNREGA పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు.
– గోడ్సే వారసులైన మోడీ @narendramodi , మహాత్ముని సందేశాన్ని, ఆదర్శాలని అవమానించిన దేశద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు
– నాడు పేదవారికి పనిదినాలు కల్పించి, ఆత్మాభిమానంతో రెండుపూటలా భోజనం వారి కష్టంతో
– వారు సంపాదించుకునే విధంగా కాంగ్రెస్ తీసుకువచ్చిన MNREGA పేరులో మార్పు చేసి బీజేపీ సర్కారు,
– గాంధీగారి ఆదర్శాలను, విలువలను పూర్తిగా కాలరాసింది.
– గోడ్సే వారసులైన, RSS ప్రతినిధులైన వీరు మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల మనోభావాల్ని తీవ్రంగా అవహేళన చేసి దేశద్రోహులనిపించుకున్నారు.
– MNREGA అనేది కేవలం మహాత్ముని పేరుతో కూడుకున్నది కాదు.
– గ్రామ స్వరాజ్, ఆత్మగౌరవం, స్వీయశక్తితో కడుపు నింపుకోవడం, ఇలాంటి విలువలు, ఆదర్శాలు నిండిన ఒక యజ్ఞము.
– దానిని నాశనం చేసి మోడీ సర్కారు చరిత్రహీనంగా మారింది.
– ఇప్పటికే రాజ్యాంగ, ప్రజాస్వామ్య, వ్యక్తిగత హక్కులను కాలరాసి దిగజారిన మోడీ సర్కారు ఇంకెంత దిగజారుతుందో.
– నాడు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్ సాకారం కావాలనే సదుద్దేశంతో MNREGA అందుబాటులోకి వచ్చింది.
– గ్రామాల స్వయం సమృద్ధి, పాలన వికేంద్రీకరణ, స్వావలంబన, అతి ముఖ్యంగా స్వాభిమానం.
– నేడు ఇవన్నీ గ్రామాలనుండి గుంజుకుని, గ్రామాల్లో ప్రజలు తమకాళ్ళపై తాము నిలవనీకుండా చేసే కుట్రలో భాగమే ఈ పథకంపై బీజేపీ దాడి.
– అన్నీ తమ అధీనంలో ఉంచుకుని గ్రామాలను కట్టుబానిసలుగా చేసి, మరల వలసలు ప్రోత్సహించే మూర్ఖత్వమే.
– నాడు వైఎస్సార్ పాలనలో MNREGA లో దేశానికి ఆదర్శంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్.
– నేడు మోడీ చెంచా పార్టీల్లా మారిన టీడీపీ, జనసేన, వైసీపీ, ఇంత దారుణం జరుగుతున్నా నోరు మెదపలేకపోవటం వారి రాజకీయ విలువల పతనానికి అద్దం పడుతోంది.
– ఇంత ఘనమైన పధకాన్ని నాడు మన తెలుగు నేలపై ప్రారంభించడంలోనే అటు కాంగ్రెస్, ఇటు వైఎస్సార్ తపన పడిన జీవనోపాధి, భద్రత, ఏ బీదవాడు ఆకలితో ఉండకూడదు అనే విషయాలు దాగివున్నాయి,
– మరి నేడు వాటిని కూలదోసి, మరలా గోడ్సే రాజ్యాన్ని, RSS రాజ్యాంగాన్ని నెలకొల్పాలనే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.
– కాంగ్రెస్ @INCIndia ఈ దారుణాన్ని చూస్తూ ఊరుకోదు,
– అడుగడుగు, బీజేపీ మార్కు ఫాసిజంపై పోరాటం చేస్తూనే ఉంటుంది.
– ఖచ్చితంగా ప్రజల గొంతుకుగా మారి, వారి చేతిలో ఆయుధమై బీజేపీ సర్కారును చీల్చి పాతాళంలో తొక్కేస్తుంది.
