కెరమెరి:
కుమురంభీం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఆదిలాబాద్ డిపోనకు చెందిన బస్సు.. కెరమెరి మండలం పరందోలి నుంచి ఆదిలాబాద్కు బయల్దేరింది. మార్గమధ్యంలో పరందోలి ఘాట్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పత్తి చేనులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు
#Sivanagendra






