శీతాకాలంలో చాలా ప్రాంతాల్లో పొగమంచు ప్రధాన సమస్య.
ఇది తరచూ రైళ్లు, విమానాలు, రోడ్లపై వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది.
శీతాకాలంలో దిల్లీ, శివారు ప్రాంతాల్లోని ప్రజలకు గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోంది.
కానీ, మరికొందరికి చలి వాతావరణమే ఇబ్బందికరంగా ఉంటుంది.
ఈ సమయంలో ఎన్నో మీమ్స్ పుట్టుకొస్తుంటాయి.
చలికాలంలో స్నానం చేయాలా? వద్దా? అనేదానిపై సోషల్ మీడియాలో, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా చర్చ జరుగుతుందనే స్టోరీలు వినిపిస్తుంటాయి.
కొందరు స్నానాన్ని నీటి వృథాకు ముడిపెడుతూ.. చలికాలంలో స్నానం చేయకపోవడాన్ని సమర్థించుకుంటుంటారు.
కొందరు టైమ్ లేదంటూ స్నానాన్ని పక్కనపెట్టేస్తుంటారు.
#Sivanagendra




