హైదరాబాద్ – నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్న నల్గొండ జిల్లాకు చెందిన త్రివేణి, వెంకటేష్ దంపతులు
భర్త అనుమానంతో వేధిస్తున్నాడని, ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.
ఇకనుండి మారతానని త్రివేణిని తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన వెంకటేష్.
కొద్ది రోజులకే భార్యపై అనుమానంతో పిల్లల ముందే భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టి, అడ్డుకున్న కూతురుని కూడా అదే మంటల్లో నెట్టేసి పారిపోయిన వెంకటేష్.
వారి అరుపులు, కేకలు విని ఆసుపత్రికి తరలించిన స్థానికులు.
అప్పటికే త్రివేణి మరణించగా, స్వల్ప గాయాలతో బయటపడిన కూతురు.
కేసు నమోదు చేసి వెంకటేష్ను అదుపులోకి తీసుకున్న నల్లకుంట పోలీసులు.
#sidhumaroju




