కర్నూలు : కర్నూలు సిటీ : ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచిన … కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మరియు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు. క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని , పోలీసుల విధి నిర్వహణ ఒత్తిడిని ఎదుర్కోనేందుకు క్రీడలు ఎంతో దోహదపడుతాయని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారులు తెలిపారు.
ఈ సంధర్బంగా ఆదివారం కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ మైదానంలో సివిల్, ఎఆర్ మరియు ఎపిఎస్పీ పోలీసులకు నిర్వహించిన పోలీసు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ను కర్నూలు జిల్లా ఎస్పీ గారు , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ లు కలిసి ప్రారంభించారు. క్రికెట్ ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచారు. జిల్లా సివిల్ , ఎఆర్ పోలీసుల జట్టు కు కెప్టెన్ గా కర్నూలు జిల్లా ఎస్పీ గారు వ్యవహరించారు. ఎపిఎస్పీ పోలీసుల జట్టుకు కెప్టెన్ గా ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ గారు వ్యవహరించారు.
ఇరు జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ టీం గా ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ పోలీసులు , రన్నర్ టీం గా కర్నూలు జిల్లా పోలీసులు గెలుపొందారు. ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మాట్లాడుతూ…కర్నూలు జిల్లా పోలీసులకు, కర్నూలు ఎపిఎస్పీ పోలీసులకు ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు . శాంతిభధ్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు ఫిట్ నెస్ తో ఉండడానికి, మానసిక నూతనోత్సహాన్ని ఇస్తాయన్నారు.
క్రీడలతో శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. గెలుపు , ఓటములు సహజమన్నారు. కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు మాట్లాడుతూ…మొత్తం సంవత్సరం అంతా బందోబస్తు విధులలో ఉండే పోలీసుల ఒత్తిడిని తగ్గించడానికి, ఫిజికల్ ఫిట్ నెస్ ఉంటూ ప్రజలకు మేరుగైన సేవలందించే ఉద్దేశ్యంతో పోలీసులు బాగా పని చేయాలని ఈ ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ లు ఎస్ . ఎం. భాషా, సుధాకర్ రెడ్డి, వెంకటరమణ, సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు, సివిల్, ఎఆర్, ఎపిఎస్పీ , ఎస్డీఆర్ ఎఫ్ పోలీసులు ఉన్నారు.




