విజయవాడ
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
– కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు 141 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
– భారతదేశ దిక్సూచి కాంగ్రెస్ పార్టీ.
– బ్రిటిష్ బానిస సంకెళ్ళను విముక్తి చేసి, దేశానికి స్వాతంత్ర్యం సాధించి,
– నవ భారత నిర్మాణానికి పునాదులు వేసి, దేశాన్ని అభివృద్ధిలో అగ్రపథంలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ.
– త్యాగం నుంచి స్వప్నం వరకు, ఉద్యమం నుంచి పాలన వరకు దేశమంటేనే కాంగ్రెస్.
– నాడు కాంగ్రెస్ సారధ్యంలో ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితమే నేటి అభివృద్ధి ఫలాలు.
– త్యాగాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిలబెడితే,
– ఇవ్వాళ భారత చరిత్రను కాషాయ పార్టీ చెద పురుగులు తొలుస్తున్నాయి.
– దేశ సహజ సంపదను తింటున్నాయి.
– రాజ్యాంగాన్ని మార్చి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వక్రీకరిస్తున్నాయి.
– వ్యవస్థలను బానిసలుగా చేసి నియంత పాలన చేస్తున్నాయి.
– సర్వమత సమ్మేళనంగా విరాజిల్లే భారతావనిని మతం ముసుగులో RSS వ్యవస్థ కలుషితం చేస్తుంది.
– అభినవ భారతంలో ఈ దేశానికి మరో స్వాతంత్ర్యం రావాల్సి ఉంది.
– కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోనే మరో విముక్తి పోరాటం చేయాల్సి ఉంది.
– దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే మత పిచ్చి గాళ్లను బంగాళాఖాతంలో కలపాల్సి ఉంది.
– ఆనాటి కాంగ్రెస్ శ్రేణుల త్యాగం,ధైర్యం ఆయుధాలుగా చేసుకొని ..
– బీజేపీ ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఉద్యమానికి సిద్ధపడాలని ఈ సందర్భంగా పిలుపు నిస్తున్నాం.




