పుంగునూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సీఐ సుబ్బారాయుడు, పోలీస్ సిబ్బంది ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 2 ద్విచక్రవాహనాలు, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని, నాటు సారా కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారి సుబ్బారాయుడు హెచ్చరించారు #కొత్తూరు మురళి .






