అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మంగళం గ్రామపంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రలతో ముద్రించిన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పట్టా పాసు పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాము, డిటి నాగేశ్వరరావు, మండల సర్వేయర్ శ్రీనివాసులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు#కొత్తూరు మురళి.




