Tuesday, January 6, 2026
spot_img
HomeSouth ZoneTelanganaఅల్వాల్ పీఎస్ పరిధిలో హత్య కలకలం.|

అల్వాల్ పీఎస్ పరిధిలో హత్య కలకలం.|

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్. ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం,  ఈ నెల 4వ తేదీ తెల్లవారు జామున ఆనంద్ రావు నగర్ కు చెందిన తిలక్ రాజ్ (28) పై లక్ష్మణ్ యాదవ్, సోను యాదవ్, రాము, మరియు అంజి అనే వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తిలక్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం  వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుడు ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 ప్రాంతంలో మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితులు మరియు మృతుడు బంధువులని కుటుంబ కలహాల కారణాల గానే ఈ ఘటన జరిగినట్టు తేలిందన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు నిందితులను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే  తెలియజేస్తామని ఆయన తెలిపారు.

#sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments