ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేసి..
రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారని ఆమె అన్నారు. కరువు నివారణకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకున్నారని రోజా విమర్శించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.




