బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ పై వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ శ్రీనివాసరావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ అందుగుల రమేష్ ను మొబైల్ ఫోన్ లో అసభ్యకరంగా దూషించినట్లు ఫిర్యాదు అందింది. రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.హెచ్.ఓ వెల్లడించారు.




