అనుమతి లేని లేఅవుట్లు తొలగింపు… పుంగనూరులో కొరడా ఝులిపించిన అధికారులు…
పుంగనూరు పురపాలక పరిధిలోని అక్రమ లేఔట్లను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు.
ప్రభుత్వం ఎస్ఆర్ఎస్ కు అవకాశమిచ్చినా పలు చోట్ల లేఔట్ దారులు దరఖాస్తు చేసుకోలేదన్నారు. దీంతో శుభారాం ప్రభుత్వ డిగ్రీకళా శాల వెనుక, యూఎన్ఆర్ సర్కిల్, గోకుల్ వీధి, మేలుపట్ల, చౌడేపల్లె రోడ్డు, రాగానిపల్లె రోడ్డు ప్రాంతాల్లో గల అక్రమ లేఔట్లలో రాళ్లను తొలగించి పురపాలక కార్యాలయానికి తరలించారు.
పురపాలక కమిషనరు మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో టీపీఎస్ జగదీశ్వర్ రెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.






