మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈసారి రాజధాని హైదరాబాద్కి దూరంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారంలో జరగనుంది
. ఈ నెల 18న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ములుగు జిల్లా, మేడారంలోని హరిత హోటల్ అందుకు వేదిక కానుంది. సాధారణంగా సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశాన్ని ఈసారి గిరిజన ప్రాంతమైన మేడారంలో నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.





