పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఆవులపల్లె పంచాయతీ రాంపల్లెలో ఈనెల 15వ తేదీ రాత్రి జరిగిన కత్తిపోటు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ శనివారం తెలిపారు.
రోహిత్, ఆకాశ్ రాజుల మధ్య చిన్నపాటి వివాదంతో ఘర్షణ చోటుచేసుకుందని, ఈ క్రమంలో ఆకాశ్ రాజు కత్తిపోటుకు గురయ్యాడని ఆయన వివరించారు. బాధితుడిని తిరుపతి రుయా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు
# కొత్తూరు మురళి.




