Monday, January 19, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవిజయవాడ నగరపాలక సంస్థ ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం

విజయవాడ నగరపాలక సంస్థ ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం

ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలి*

ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యకు క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందిస్తామన్న భరోసాని ఇవ్వడమే కాకుండా సత్వరమే అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 4, ఇంజనీరింగ్ 3, పబ్లిక్ హెల్త్ 1, రెవెన్యూ 1 మొత్తం కలిపి 9 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ i/c పి సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజీ వి.కామేశ్వరరావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments