మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమం పాపన్నపేట,నర్సింగి,మెదక్ ,హవేలీఘనాపూర్ (4 ) మండలం లోని దాదాపు 100 మంది సర్పంచులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఈ శిక్షణ కార్యక్రమం లో సర్పంచులు పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన చేసుకోవాలన్నారు.
పంచాయతీ రాజ్ చట్టం లోని గ్రామ పాలన విధులు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పథకాల అమలు ఆర్థిక నిర్వహణ గ్రామాభివృద్ధి పథకాలు వంటి విపత్తుల సమయం లో సర్పంచ్ ల పాత్ర, డిజిటల్ సైన్ ఆదర్శ గ్రామపంచాయతీ ల నిర్మాణం తదితర అంశాలపై సర్పంచ్ల బాధ్యతలపై అవగాహన కల్పించడం జరుగుతుందని
పంచాయతీ రాజ్ చట్టం లోని ప్రతీ అంశాన్ని సర్పంచ్ లు అవగాహన కలిగి ఉండాలన్నారు.
విద్య, వైద్యం నిరుపేదల కు అందేలా సర్పంచ్ లు కృషి చేయాలన్నారు
మానవత్వ కోణం లో పని చేయాలనీ సూచించారు.డిజిటల్ గవర్ననెన్స్ కి దోహద పడాలన్నారు.
కమ్యూనికేషన్ స్కిల్స్,నాయకత్వ లక్షణాలు, మోరల్ స్కిల్స్, తదితర అంశాల పైన కూడా సర్పంచ్ లకు అవగాహన ఉండాలన్నారు.గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీలకు అతీతంగా మంచి
– చెడుల న్యాయ నిర్ణేత సర్పంచ్ దే అని అన్నారు.వివిధ శాఖల తో సమన్వయం చేసుకొని రోడ్డు నిర్మాణాలు ఇతర గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పోటీ పడాలన్నారు.మరుగు దొడ్లు లేకపోతే కట్టించే ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎప్పటికప్పుడు చెత్త సేకరణ,పిచ్చి మొక్కల తొలగింపు,వర్షాకాలంలో నీటి నిల్వ తొలగింపు,సీజనల్ అంటూ వ్యాధుల రాకుండా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలన్ని సర్పంచులు చేయాలన్నార






