అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు రూ. 20 లక్షలతో సుబేదారూ వీధి చౌక్ మసీదు భవన నిర్మాణానికి మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ అలిమ్ భాష నిర్మాణ పనులను పరిశీలించి.
నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డిఈ మహేష్, ఏఈ రూపేష్, మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు అమ్ము, కిజార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.




