బుధవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తెట్టుపల్లి, కంచెంవారి పల్లి గ్రామాలలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం జరిగింది.
వ్యవసాయ శాఖ ఏడి శివకుమార్ మాట్లాడుతూ, రైతులు తమ పంటలను ఆర్ఎస్కే ఇన్చార్జి వద్ద ఈ పంట యాప్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఏఓ సుధాకర్ మాట్లాడుతూ, అధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు# కొత్తూరు మురళి .




