AP: ప్రభుత్వ టీచర్లకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఏప్రిల్, మే నెలల్లో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు జరగనున్నాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించారు. హైస్కూల్ ప్లస్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.




