మదనపల్లి: నెలలో తల్లిదండ్రులు రాకపోతే అనాధగా ప్రకటింపు.

0
6

మదనపల్లి బాలాజీ నగరులో పురిటి ఆడ శిశువును వదిలి వెళ్లిన ఘటనపై పోలీసులు, ఐసిడియస్ సిబ్బంది స్పందించారు.

శిశువును జిల్లా శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. సంబంధిత తల్లిదండ్రులు తగిన ఆధారాలతో నెల రోజుల్లోగా హాజరుకాకపోతే, ఆ శిశువును అనాధగా ప్రకటిస్తామని శిశు సంక్షేమ శాఖ శుక్రవారం ప్రకటించింది.